Tuesday, June 5, 2012

బౌద్ధ దర్శనం (1) - నాస్తిక దర్శనం

బౌద్ధ దర్శనానికి గౌతమ బుద్ధుడు మూలపురుషుడు. 
తన చుట్టూఉన్న పరిసరాలను చూసినపుడు , తనకు ఎదురుపడిన సంఘటనలైన ముసలితనము, వ్యాధులు, మరణము మొదలైనవాటిని ఎవరూ తప్పించుకోలేరని గ్రహించి, వీరు, వీరి కుటుంబీకులు పడే దుఃఖానికి చలించిపోయాడు. ఈ దుఃఖాన్ని నివారించడానికి మార్గాలను అన్వేషించ సాగేడు. 
ఎంతోమంది మహాపురుషులను ఆశ్రయించినా; సరైన సమాధానం లభించలేదు. 
అన్వేషణలో భాగంగా సుదీర్ఘమైన తపస్సుచేసి, దుఃఖానికి నివారణోపాయాన్ని కనుగొన్నాడు. 
అవి నాలుగు సత్యాలుగా ప్రచారంలోకి వచ్చాయి.

మొదటి సత్యం - ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. ఈ దుఃఖం పైపైకి కన్పించేది మాత్రమే కాదనీ , అంతటా సంసారంలో  స్థిరంగా పాతుకుపోయి ఉందనీ, సుఖాలుగా కన్పించే విషయాల్లోనూ అంతర్గతంగా దుఃఖంఉందని, బుద్ధుడు కనుగొన్న మొదటిసత్యం. 

ఇక రెండవ సత్యం - ఈ దుఃఖానికి కారణం ఉంది. విషయవాంఛ/ లేక తృష్ణ అనేది దుఃఖానికి కారణం. ఈ ప్రపంచంలో ఎప్పటికీ ఉండే స్థిరమైనపదార్ధం గాని, వస్తువుగాని, విషయం అనేదిగాని లేదు. ప్రతీ వస్తువు మార్పుచెందే స్వభావం కలిగినదే. కాని మనం ప్రతివిషయంలోనూ స్థిరత్వాన్ని కోరుకుంటాం. అందుచేత దుఃఖానికి లోనవుతూ ఉంటాం. ఆలోచించి చూస్తే దుఃఖముకూడా ఎప్పటికీ ఉండదు. ఈ ప్రపంచంలో పుట్టడమే దుఃఖానికి కారణం. ఇలా తిరిగితిరిగి పుట్టడానికి విషయ వాంఛలే కారణం. ఇది అజ్ఞానంవల్ల ఏర్పడుతుంది. 

ఇక మూడవ సత్యం - ఈ దుఃఖాన్ని పూర్తిగా తొలగించుకోవచ్చు. దుఃఖకారణాన్ని తొలగిస్తే దుఃఖం పోతుంది. అజ్ఞానాన్ని తొలగించుకొని  నిర్వాణం  పొందటంవల్ల దుఃఖం పూర్తిగా నశిస్తుంది . 

ఇక నాల్గవ సత్యం - దుఃఖానికిగల కారణాన్ని తొలగించుకోడానికి మార్గం ఉంది.


       

No comments:

Post a Comment